NATIONAL

12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం

ఏ.పికి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‎..

అమరావతి: 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది..గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోద ముద్ర వేశారు..ఆంధ్రప్రదేశ్‎కి కొత్త గవర్నర్‎గా సుప్రీమ్ కోర్డు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‎ను నియమించారు..ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛతీస్‎ఘడ్ రాష్ట్ర గవర్నర్‎గా బదిలీ చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్‌,, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ప్రసాద్‌,, అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా త్రివిక్రమ్‌ పట్నాయక్‌,, జార్ఖండ్‌ గవర్నర్‌గా రాధాకృష్ణన్‌,,అసోం గవర్నర్‌గా గులాబ్‌చంద్‌ కటారియా,, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా శివప్రసాద్‌ శుక్లా,, మణిపూర్‌ గవర్నర్‌ అనసూయ,,లడఖ్‌ గవర్నర్‌గా బీడీ మిశ్రా,,నాగాలండ్‌ గవర్నర్‌గా గణేషన్‌,, మేఘాలయ గవర్నర్‌గా ఫాగు చౌహాన్,,బీహార్ గవర్నర్‌గా విశ్వనాథ్ అర్లేకర్,, లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బి.డి.మిశ్రాను నియమించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *