11 మంది జవాన్ల ప్రాణలు బలిగొన్న మావోయిస్టులు
అమరావతి: ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు అదును చూసి మందుపాతర పేల్చి,,జవాన్ల ప్రాణాలు బలిగొన్నారు.. బుధవారం దంతేవాడలోని అరన్ పూర్ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వస్తుండగా IED మందు పాతర పెట్టి పేల్చివేయడంతో 11 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు..మరణించిన జవాన్లను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు(DRG) చెందిన వారిగా గుర్తించారు..అరన్ పూర్ లో మవోయిస్టుల ఉనికి ఉందన్న పక్కా సమాచారంతో డీఆర్జీ బృదం..కూబింగ్ ఆపరేషన్ చేపట్టింది..సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు సంఘటన స్థలనికి చేరుకున్నారు..నక్సలైట్ల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ మొదలుపెట్టారు..కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్తో మాట్లాడారు..అన్నివిధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.