ఉత్తరప్రదేశ్లో కరుడుకట్టిన మరో గ్యాంగ్స్టర్ ఎన్ కౌంటర్
అమరావతి: ఉత్తరప్రదేశ్లో స్పెషల్ టాస్క్ పోలీసులకు, అనిల్ దుజానా అనే కరడుగట్టిన గ్యాంగ్స్టర్ మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అనిల్ హతమయ్యాడు.. కాంట్రాక్ట్ కిల్లర్ అయిన అనిల్ దుజానాపై మొత్తం 18 హత్య కేసులున్నాయని ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ అడిషనల్ డీజీపీ అమితాబ్ యష్ తెలిపారు..ఉత్తరప్రదేశ్ సీ.ఎం యోగి ఆదిత్యనాథ్ మాఫియాపై ఉక్కుపాదం మోపునున్నట్లు ఇటివల అసెంబ్లీలో స్పష్టం చేశారు..2017 నుంచి నేటి వరకు 23 వేల మందికి పైగా క్రిమినల్స్ ను అరెస్ట్ చేశారు..క్రిమినల్స్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో 1424 మంది పోలీసులు గాయపడ్డారు..ఇప్పటివరకూ 184 మంది క్రిమినల్స్ను యూపీ పోలీసులు మట్టుబెట్టారు.. ఎదురుకాల్పుల ఘటనల్లో 13 మంది పోలీసులు మరణించారు..