పాకిస్తాన్ రిటైర్డ్ జనరల్ ఫర్వేజ్ ముషారఫ్ మరణం
అమరావతి: శత్రుదేశం పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ జనరల్ ఫర్వేజ్ ముషారఫ్ (79) అదివారం మరణించారు.. అమిలోయిడోసిస్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, గత కొంతకాలంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు..నేటి ఉదయం అయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.. ముషారఫ్ మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది.. 1999లో కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ ప్రధాన కారకుడు..