సంగం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిశీలించిన కమిషనర్, అసిస్టెంట్ కలెక్టర్
నెల్లూరు నగర వ్యాప్తంగా మంచినీటిని సరఫరా చేస్తున్న సంగం మండలం మహమ్మదాపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్(IAS).అసిస్టెంట్ కలెక్టర్ విద్యాధరి,(IAS)తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనకట్ట మీద నిర్మించిన ఇండెక్ వెల్, కొండమీద నిర్మించిన 122 M.L.D సామర్ధ్యం గల ట్రీట్మెంట్ ప్లాంట్, క్లియర్ వాటర్ సంప్, పంప్ హౌస్ తదితర నిర్మాణాలను, వివిధ విభాగాల పనితీరును కమిషనర్, అసిస్టెంట్ కలెక్టర్ కు వివరించారు. వేసవి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నగరంలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ విభాగం E.E ఆలీ, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం E.E సంజయ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.