కోవూరు నియోజకవర్గం పరిధిలోని వంగల్లులో గ్రావెల్ మాఫియా-జనసేన,కిషోర్
నెల్లూరు: కోవూరు నియోజక వర్గం పరిధిలో కోట్లాది రూపాయల గ్రావెల్ అక్రమంగా తరలి పోతున్నదని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ ఆరోపించారు.సోమవారం జనసేన కార్య కార్యకర్తలతో కలసి అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న ప్రదేశంను పరిశీలించి,నిరసన చేపట్టారు..ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మొన్నటి దాకా కనిగిరి రిజర్వ్యాయర్ వద్ద ౩౦ అడుగుల మేర వంద ఎకరాల పైబడి అక్రమంగా తవ్వేవరని,,అక్కడి ప్రజలు గమనించే సరికి ఇప్పుడు వంగల్లు నుంచి గ్రావెల్ దారి మళ్లించి దోచుకుంటున్నారని తెలిపారు..విచ్చలవిడి త్రవ్వకాల కారణంగా వర్షకాలంలో వరదలు వఛ్చి కట్టలు తెగితే దాదాపు 10 గ్రామాలు నీట మునుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీజిల్లా ఉపాధ్యక్షులు సుధీర్,కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,సాయి, షారూ,ఇబ్రహీం,మౌనేష్,షాజహాన్, కాసీఫ్, ఋషి, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.