రామలల్లా ఆలయంలో గర్భగుడి నిర్మాణం పూర్తి అయింది-కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా
అమరావతి: అయోధ్యలోబాలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు పండితులు నిర్వహించారు..శ్రీరామ జన్మభూమి తీర్దక్షేత్రట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా,,అయన సతీమణి,తదితరులు సరయు నది తీరంలో బుధవారం కలశ పూజను నిర్వహించి,,కలశాల్లో సరయు నది నీటిని రామ మందిరంలోకి తీసుకున్న వెళ్లారు..గర్భగుడిలో రామ విగ్రహాం ప్రతిష్టించే స్థలంలో పూజలు నిర్వహించారు..గురువారం గర్బగుడితో బాలరాముడి విగ్రహాన్ని చేర్చనున్నారు..
నిర్మాణం పూర్తయింది:- అయోధ్యలో రామ్ లల్లా ఆలయ నిర్మాణం పూర్తయిందని రామమందిరం నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా బుధవారం నాడు వెల్లడించారు..అసంపూర్తిగా ఉన్న రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతోందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మిశ్రా తాజా ప్రకటన చేస్తూ రామలల్లా ఆలయంలో గర్భగుడి ఉందని, అది పూర్తయిందని వెల్లడించారు..గర్భగుడి,,5 మండపాలతో గ్రౌండ్ ఫోర్ల్ లో ఆలయం ఉంది.. ఆ ఆలయం పూర్తయింది.. మొదటి అంతస్తు నిర్మాణంలో ఉంది..అందులో రామ్ దర్బార్ ఉంటుంది.. రెండో అంతస్తు కేవలం అనుష్ఠాన్ కోసం ఉంది.. అందులో వివిధ రకాల యోగాలు, అనుష్టానాలు జరుగుతాయి” పేర్కొన్నారు..