AMARAVATHINATIONAL

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల నుంచి నాకు ప్రాణహాని-సుఖేష్ చంద్రశేఖర్

అమరావతి: ఆమ్ ఆద్మీ పార్టీకి నిద్రలేకుండా చేస్తున్న సుఖేష్ చంద్రశేఖర్, మళ్లీ సంచలన ఆరోపణలు చేశారు..రూ. 200 కోట్ల రూపాయల మానీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవస్తున్నాడు..ప్రస్తుతం ఉంటున్న ఢిల్లీలోని మండోలి జైలులో తనకు భద్రత లేదని,,ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తనను చంపాలని ప్రయత్నిస్తుంటున్నారంటూ ఢిల్లీ లెఫ్టినెంటే గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనాకు శనివారం లేఖ రాశారు..గతంలో అతను తిహార్ జైలులో ఉండగా ఆ తరువాత ఢిల్లీలోని మండోలి జైలుకు తరలించారు..ఈ నేపథ్యంలో జులై 1వ తేదిన తనకు బెదిరింపు కాల్ వచ్చిందని తన అడ్వకేట్ అనంత్ మాలిక్ కు లేఖ రాశారు..ఆ లేఖను అత్యవసర నోటీసుగా పరిగణించాలని కోరారు..గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని,, లేదంటే తనకు జైల్లో పెట్టే ఆహారంలో విషం కలిపి చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపాడు.. జైలు నిర్వహణ ఢిల్లీ ప్రభుత్వం అధీనంలోనే ఉందని,,కాల్ చేసిన వ్యక్తి కేజ్రివాల్ తో పాటు ఢిల్లీ మాజీ సీఎం సత్యేంద్రజైన్, ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ప్రస్తావించారని పేర్కొన్నారు..అలాగే జూన్ 23వ తేదిన తన తల్లికి సత్యేంద్రజైన్ భార్య తన తల్లికి ఫోన్ చేసిందని,, కేజ్రీవాల్ పై తాను చేసిన ఫిర్యాదులు వెనక్కి తీసుకోనేలా చేయాలని బెదిరించిందని తెలిపాడు..అలాగే జైలు అధికారులు కూడా తనను బెదిరిస్తున్నారని,,మండోలి జైలలో భద్రత లేదని తెలిపారు..దయచేసి ఈ జైలు నుంచి వేరే జైలుకు బదిలీ చేయాలని లేఖలో కోరాడు..ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆధినంలో లేని మరో రాష్ట్రంలో ఉన్న జైలుకు పంపించాలని వేడుకుంటున్నాను అని లేఖలో విజ్ఞప్తి చేశాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *