అరవింద్ కేజ్రివాల్ దుబాయ్ లో మూడు అపార్ట్ మెంట్లను కొనుగోలు చేశాడు-సుఖేష్ చంద్రశేఖర్
అమరావతి: సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఫార్మా కాంట్రాక్టర్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు ముడుపులు అందాయని ఆరోపించారు..2020లో ఫార్మా కాంట్రాక్టర్ నుంచి 65 మిలియన్ దిర్హామ్ ల మొత్తాని లంచం రూపంలో అందుకున్నాడని,, ఈ డబ్బుతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్ లోని జుమేరా పామ్స్ ప్రాంతంలో మూడు లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేశాడని సంచలన ఆరోపణలు చేశారు..వారం రోజుల క్రితం మూడు అపార్ట్ మెంట్లను కేజ్రీవాల్ అత్యవసరంగా అమ్మకానికి పెట్టారన్నారు..ఈ మేరకు సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి తన తరపు న్యాయవాది అనంత మాలిక్ ద్వారా ఈ లేఖ విడుదల చేశారు.