విదేశీ విరాళాల సేకరణలో నిబంధనలు ఉల్లఘించిన NGOs లైసెన్సులు రద్దు
అమరావతి: విదేశాల నుంచి భారీ స్థాయిలో విరాళాలు పొందుతూ చట్టాలను ఉల్లంఘించారనే కారణంగా 5 స్వచ్ఛంద సంస్థల పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది..విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద వారి లైసెన్సులను రద్దు చేసింది..రద్దు చేసిన సంస్థల్లో చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా,,వాలంటరీ హెల్త్ అసోసిసియేషన్ ఆఫ్ ఇండియా,,ఇండో-గ్లోబల్ సోషల్ సర్వీస్ సొసైటీ,, చర్చ్ ఆక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్,, ఎవేంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు తెలుస్తొంది.. ఫారిన్ ఫండింగ్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యల విషయంలో హోంశాఖ పట్టుదలగా వ్యవహరిస్తొంది..ఈ సంవత్సరం ప్రారంభంలో సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లైసెన్స్ ను రద్దు చేసింది.. 2020 నుంచి FCRA నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది..పలు సమరణలు చేస్తూ,,NGOs లైసెన్సుల రద్దు చేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది..చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంగా ఇప్పటికే పలు సంస్థల లైసెన్సులను రద్దు చేసింది.