సిగ్నలింగ్ పాయింట్ లో మార్పుల వల్లే ఈప్రమాదం జరిగింది-రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
అమరావతి: ఒడిశా చోటు చేసుకున్న రెండు రైళ్ల ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు..ఇది ప్రమాద వశాత్తు జరిగిందికాదని,,సిగ్నలింగ్ పాయింట్ లో మార్పుల వల్లే ఈప్రమాదం జరిగిందన్నారు..అశ్విని వైష్ణవ్ అదివారం ఉదయం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో కలిసి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు..ఈ సందర్భంలో అయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టంలో మార్పులు చేశారని,,ఈ మార్పుల కారణంగానే ఇంతటి ప్రమాదం చోరటు చేసుకుందని వెల్లడించారు..కవచ్ వ్యవస్థ లేకపోవడం రైల్వే ప్రమాదానికి కారణం కాదని మంత్రి స్పష్టం చేశారు..సిగ్నలింగ్ పాయింట్ లో మార్పులు చేసిన వారిని గుర్తించామని,,త్వరలోనే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు..సిగ్నలింగ్ లో జరిగిన ట్యాంపరింగ్ పై నివేదిక సిద్ధమైందన్నారు.. ప్రమాదం కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని,,బుధవారం ఉదయం లోపు ఈ పనులను పూర్తి చేసి ట్రాక్ పై మళ్లీ రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.