AMARAVATHI

”అన్న భాగ్య” పథకం బదులుగా రూ.170 ఇస్తాం-సి.ఎం సిద్దరామయ్య

అమరావతి: ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టేందుకు రాజకీయ పార్టీ ఉచిత పథకాలను అందిస్తామంటూ హామీలు గుప్పించి,తీరా అధికారం చేపట్టిన తరువాత ఉచిత హామీ పథకాలకు వివిధ నిబంధనలు అమలు చేస్తు,ఓటర్లకు మొండి చెయ్యి చూపిస్తుంటాయి…ఇందుకు ఉదాహరణ….కర్ణాటక కాంగ్రెస్ కు ఎన్నికల సమయంలో ఐదు ఉచిత హామీల అమలు చేస్తామని చెప్పింది..పేదలకు ప్రతి నెల కేంద్రప్రభుత్వం ఇచ్చే 5 కేజీల బియ్యంకు ఆదనంగా ”అన్న భాగ్య” పథకం కింద మరో 5 కేజిలు బియ్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దనం చేసింది..బయట రాష్ట్రల్లో ఎక్కడ బియ్యం దొరక్క పోవడంతో బీపీఎల్ కార్డులున్న వారికి 5 కిలోల ఉచిత బియ్యానికి బదులుగా నగదును అందజేయాలని మంత్రివర్గం బుధవారంనాడు జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది..మంత్రివర్గ నిర్ణయం ప్రకారం బీపీఎల్ కార్డుదారులకు మార్కెట్ ధర ప్రకారం 5 కేజీల బియ్యం డబ్బును వారి అకౌంట్లకు జమ చేస్తారు..ఇందువల్ల ప్రభుత్వంపై రూ.750 కోట్ల నుంచి 800 కోట్ల భారం పడుతుంది.. బీపీఎల్ కార్డుహోల్డర్ కు ప్రతి నెలా బియ్యానికి బదులు రూ.170 ఇస్తారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *