AMARAVATHIDEVOTIONAL

మార్చి 26 నుంచి ప్రతీ రోజు విజయవాడ నుంచి నేరుగా షిర్డీకి విమాన సర్వీసులు

అమరావతి: విజయవాడ నుంచి షిర్డీ వెళ్ళాలంటే ట్రైన్ లో అయితే దాదాపు 12 గంటల సమయం పడుతుంది..చాల రోజులుగా భక్తులు షిర్దీకి విమాన సర్వీసులను ప్రారంభించాలని కోరుతున్నారు..ఎట్టకేలకు మార్చి 26 నుంచి ప్రతీ రోజు విజయవాడ నుంచి నేరుగా షిర్డీకి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి..ప్రతీ రోజు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన ATR 72-600 విమానం షిర్డీకి ప్రయాణికులకు సేవలు అందించనున్నదని ఎయిర్ లైన్స్ కు చెందిన సంబంధిత అధికారులు తెలిపారు..72 మంది ప్రయాణీకులను తీసుకుని వెళ్లే సామర్థ్యం ఉంది..ఈ సర్వీసుల ప్రతీ రోజు మధ్నాహ్నం 12.25 గంటలకు గన్నవరంఃలో బయల్దేరి, 3 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది..అలాగే ప్రతీ రోజు షిర్డిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది..ప్రయాణ సమయం 2 గంటల 50 నిమిషాలు..గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి షిర్డీకి టికెట్ ధర రూ.4,246.. షిర్డీ నుండి రిటర్న్ టికెట్ ధర రూ.4,639గా నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *