ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడి లంచం కేసులోకి ఈడీ రంగప్రవేశం
అమరావతి: బెంగళూరు దావణగెరె జిల్లా చన్నగిరి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడి లంచం కేసు కొత్త మలుపు తిరిగింది..లంచం కేసులో అక్రమ దొరికిన డబ్బుపై మీరు నమోదు చేసిన కేసు వివరాలను తెలియచేయాలంటూ ED, కర్ణాటక లోకాయుక్తకు ఈ-మెయిల్ పంపింది..లంచం సమాచారం పూర్తి స్థాయిలో సేకరించిన అనంతరం లోకాయుక్త అధికారులు,,కేసు ప్రాథమిక దర్యాప్తు నివేదికతో పాటు ఈడీకి సమాచారం అందించనున్నట్లు తెలిసింది..లోకాయుక్త నివేదికతో ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పతో పాటుగా ఆయన కుమారుడు ప్రశాంత్ కూడా ఈడీకి సమాధానం చెప్పాల్సి వుంటుంది..
లంచం నేపధ్యం:-ఒక పెద్ద వర్క్ కు సంబంధించి టెండర్ ఆశించిన కాంట్రాక్టర్ వద్ద నుంచి ప్రశాంత్ మాదాల్ రూ.80 లక్షలు డిమాండ్ చేశాడు..ఇందులో రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు..అనంతరం ఇంటిని తనిఖీ చేసిన లోకాయుక్త అధికారులకు ఎక్కడ చూసినా డబ్బు కట్టలే,,దాదాపు రూ.8 కోట్లు వరకు దొరికినట్లు సమాచారం..ఈ కేసుకు సంబంధించి ప్రశాంత్ మాదాల్, అతని బంధువు సిద్దేష్,, అకౌంటెంట్ సురేంద్ర,, డబ్బులు చెల్లించేందుకు వచ్చిన నికోలస్,, గంగాధర్లను లోకాయుక్త అధికారులు అదుపులోకి తీసుకున్నారు.. అరెస్టు చేసిన ఐదుగురిని కోర్టు ముందు హజరుపర్చగా వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఆదేశించింది.