AMARAVATHI

రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం-వాతావరణ శాఖ

అమరావతి: వేసవి కాలంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నప్పటికి రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది..మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి-గాలులు తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొన్నారు..ద్రోణి కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాతావరణం కొంత మేర ఉఫశమనం కలగవచ్చు..దక్షిణ కోస్తా ప్రాంతంలో శుక్రవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది..గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పుకు అవకాశం లేదని అధికారులు తెలిపారు..శనివారం రాష్ట్రంలో పలు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం,, గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండదు..ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది..రాయలసీమలో శుక్రవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువుగా నమోదయ్యా అవకాశం ఉంది..శనివారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది..గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండదు.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది..గంటలకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *