AMARAVATHICRIMENATIONAL

ఉత్తరప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం-15 మంది మృతి

అమరావతి: ఉత్తరప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న చెరువులో పడిపోయింది..ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు.. మాఘ పూర్ణిమ సందర్భంగా కొందరు భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానం చేసేందుకు ట్రాక్టర్‌లో కేదర్‌గంజ్‌కు బయల్దేరారు..ఈ క్రమంలో కస్‌గంజ్‌ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ టర్నింగ్ వద్దకు రాగానే అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు మరణించిగా ఇందులో 7 చిన్నారులు ఉన్నారు.. స్థానికులు వెంటనే స్పందించిన గాయపడ్డిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు..ఈ దుర్ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..ఈ మేరకు మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు,, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *