NATIONAL

బెంగళూరులో భారీ వర్షాల కారణంగా స్తంభిస్తున్న జనజీవనం

అమరావతి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. సమాచార, రవాణా వ్యవస్థ కూడా దెబ్బతినడంతో జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మంగళవారం బెంగళూరు మహానగరంలో సెలవు ప్రకటించింది.భారత వాతావరణ శాఖ యెల్లో అలెర్ట్ జారీ చేయడంతో,,బెంగళూరుతోపాటు బెలగావి, ఇతర కర్ణాటక జిల్లాల అధికారులు అప్రమత్తమైయ్యారు.వర్షాల కారణంగా బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది.అలాగే సోమవారం కురిసిన భారీ వర్షంతో రోడ్లపై పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి.అనేక చోట్ల మోకాలి లోతు వరకు నీళ్లు నిలిచిపోయాయి.బెంగళూరు-మైసూరు హైవేపై రవాణా చాలా వరకు నిలిచిపోయింది.నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పర్యటించి,,సహాయక చర్యలు వేగవంతం చేస్తామని ప్రకటించారు.వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు బోట్లలో సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

13 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

14 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

16 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

16 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

17 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

2 days ago

This website uses cookies.