రత్నం విద్యాసంస్థల అధినేత కె వి రత్నం కన్నుమూత
నెల్లూరు: రత్నం విద్యా సంస్థల అధినేత కె వి రత్నం(80) బుధవారం మధ్యాహ్నం పరమదించారు..1984 సంవత్సరంలో రత్నం విద్యాసంస్థలను ప్రారంభించారు..కొద్ది కాలంలోనే విద్యాసంస్ధలను రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించారు..2006లో చిన్న పిల్లల కోసం చిన్నారి హర్ట్ ఫౌండేషన్ స్థాపించి,,దాని ద్వారా చాలా మంది చిన్ని పిల్లలకు ఉచితంగా వైద్యం అందించారు.. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో మద్రాసులో చికిత్స పొందుతూన్న అయన ఇటీవల చాలా వరకు కొలుకున్నారు..ఈ నేపధ్యంలో నేడు పరిస్థితి విషమించడంతో మద్రాసు నుంచి నెల్లూరుకు తీసుకుని వచ్చిన తరువాత అయన స్వగృహం వద్ద తుది శ్వాస విడిచారు.