AMARAVATHIPOLITICS

తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోంది-జెడీ.లక్ష్మీనారాయణ

అమరావతి: జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు..ఈ విషయమై శుక్రవారం విశాఖ పోలీస్ కమీషనర్ ఎ. రవిశంకర్​ను కలిసి ఫిర్యాదు చేసి,, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని లక్ష్మీనారాయణ కోరారు..విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు లక్ష్మీనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు.. ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీకి జేడీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది..తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం అయనకు అందడంతో ఈ మేరకు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *