6 సం..గా జనసేన వేదిక ఇచ్చింది అయిన వైసీపీలో వెళ్లుతున్నా-మనుక్రాంత్ రెడ్డి
నెల్లూరు: 6 సం..జనసేన వేదిక ఇచ్చింది అయిన వైసీపీలో వెళ్లుతున్నా అంటూ జనసేన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మను క్రాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు బుధవారం ప్రకటించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మను క్రాంతి రెడ్డి మాట్లాడుతూ పార్టీ నేతలతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానాని పేర్కొన్నారు..ఆరు సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం పనిచేశానని,జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్వహిస్తున్నానని, ఏడాదిన్నర నుంచి ఇంటింటి ప్రచారం చేశానాని గుర్తు చేశారు..నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ అండగా ఉంటారని భావిస్తున్నానని ఆయన ప్రకటించారు.నాతో పాటు పలువురు నా అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వెల్లడించారు..
విజయసాయిరెడ్డి:- ఈ సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జనసేన జిల్లా అధ్యక్షుడు మానక్రాంత్ రెడ్డి వైఎస్ఆర్ సిపిలోకి ఆహ్వానించినట్టు చెప్పారు..దీనికి ఆయన సానుకూలంగా ఉన్నారని తెలిపారు..ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని వెల్లడించారు.మను క్రాంత్ రెడ్డి హోదా, అనుభవానికి తగినట్టుగా పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తామాని చెప్పారు..ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత మను క్రాంత్ రెడ్డికి రాజకీయ భవితవ్యం పై మంచి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు..