మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్
అమరావతి: మధ్యప్రదేశ్ సీఎంగా ఎవరు ఊహించని విధంగా మోహన్ యాదవ్ ను బీజెపీ అధిష్టానం ఎంపిక చేసింది..2013లో తొలిసారి ఎమ్మెల్యేగా మోహన్ యాదవ్ ఎన్నికయ్యారు..3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయన ఉజ్జయిని సౌత్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు..శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ లో మంత్రిగా ;పనిచేశారు.. భోపాల్ లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. బీజేపీ అధిష్టానం పంపిన నేతలు మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చలు జరిపారు..అనంతరం మోహన్ యాదవ్ పేరును ప్రకటించారు..సీ.ఎం రేసులో శివరాజ్ సింగ్ తో పాటు కేంద్రమంత్రులు ప్రహ్లాద్ పటేల్,, నరేంద్ర తోమర్ కూడా సీఎం రేసులో ఉన్నప్పటికీ,,అధిష్టానం మోహన్ యాదవ్ ను తెరపైకి తీసుకువచ్చింది.. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో మరో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం.