AMARAVATHINATIONAL

బిర్సా ముండాకు నివాళు ఆర్పించిన ప్రధాని మోదీ

అమరావతి: జార్ఖండ్ లో పర్యటలో ప్రధాని నరేంద్ర మోదీ, బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతును బుధవారం సందర్శించారు..నవంబర్ 15 బిర్సాముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. దీంతో మోదీ భారత చరిత్రలో బిర్సాముండా జన్మస్థలాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.. “బిర్సాముండా” జార్ఖండ్ ప్రజల ఆరాధ్య దేవుడు…బ్రిటీషువారిని ముప్పు తిప్పలు పెట్టిన ఆదివాసీల దేవుడుగా కీర్తించబడుతున్న గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు…బిర్సా ముండా జార్ఖండ్ లోని ఖుంటి జిల్లాలోని ఉలిహతులో 1875 నవంబర్ 15న జన్మించారు.. ఉలిహతులో బిర్సా ముండా విగ్రహానికి ప్రధాని మోదీ నివాళులర్పించిన ఆనంతరం బిర్సా కుటుంబ సభ్యులను కలుసుకున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *