AMARAVATHI

తొలిసారి బుల్లి తెరపై వార్తలు చదివిన న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

.అమరావతి: బుల్లి తెరపై నమస్కారం వార్తల్లోని ముఖ్యంశాలు అంటూ దూరదర్శన్‌లో తొలిసారి తెలుగు వార్తను చదివి, శాంతి స్వరూప్‌ శుక్రవారం మృతి చెందారు..రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు..చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దూరదర్శన్‌లో 10 సంవత్సరాలు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి చెప్పేవారు..టీడీ మాధ్యమాల్లో ప్రసారమైన తెలుగు వార్తల్లో మొట్టమొదటి న్యూస్‌ రీడర్‌గా శాంతి స్వరూప్ పేరు చరిత్రలో నిలిచిపోయింది.. 1983 నవంబర్ 14న సాయంత్రం 7:00 గంటలకు తొలిసారిగా తెలుగులో వార్తలను ప్రసారం చేశారు.. 2011లో పదవీ విరమణ చేసే వరకు శాంతి స్వరూప్‌ దూరదర్శన్‌లో పని చేశారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *