రెపో రేటును 6.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించిన RBI గవర్నర్ శక్తికాంత్ దాస్
అమరావతి: భారతీయ రిజర్వ్ బ్యాంకు శుక్రవారం కీలకమైన రెపో రేటును మార్చలేదు.. రెపో రేటును 6.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.. రెపో రేటు యథాతథంగా ఉంచేందుకు ద్రవ్య పరపతి కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు..ఆర్థిక వృద్ధి గాడిలో పడిందని,,జనవరి, ఫిబ్రవరి నెలల్లో ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉందన్నారు..డిసెంబర్ 5.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రెండు నెలల్లోనే 5.1 శాతానికి తగ్గినట్లు చెప్పారు.. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తీసుకువచ్చే ప్రక్రియలు కొనసాగుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.. జీడీపీ అంచనాల గురించి కూడా శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేస్తూ 2024-25 సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.. రిస్క్ ప్రస్తుతం సమతుల్యంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.