AMARAVATHINATIONAL

ఐదు రాష్ట్రాలకు మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా,తెలంగాణలో నవంబరు 30న పోలింగ్

డిశంబరు 5వ తేది నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి..
అమరావతి: ఐదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్స్ ను విడదల చేసింది.సోమవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.మధ్యప్రదేశ్,,రాజస్థాన్,,తెలంగాణ,,మిజోరాం,,ఛత్తీస్ ఘడ్ రాష్ట్రల్లో ఎన్నికల నిర్వహణ తేదిలను ప్రకటించారు.
ఐదు రాష్ట్రాల్లో నవంబర్ రెండవ వారం నుంచి డిసెంబర్ మొదటి వారంలో లోపు ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొన్నారు..ఐదు రాష్ట్రాల్లో 8.2 కోట్ల మంది పురుష ఓటర్లు, 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు..ఇందులో 60.2 లక్షల మంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబరు 17న,,తెలంగాణ,,మధ్యప్రదేశ్,,రాజస్థాన్,,తెలంగాణ,,ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ గడువు జనవరి నెలలో వివిధ తేదిల్లో ముగుస్తుంది..చత్తీస్ ఘడ్ కు మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి..
తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు,, రాజస్థాన్లో 200 స్థానాలకు,, మధ్యప్రదేశ్లో 230,, మిజోరంలో 40,, చత్తీస్ ఘడ్ 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి..మొత్తం ఐదు రాష్ట్రంలో 679 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తాము..
తెలంగాణలో నవంబరు 3వ తేదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది..నవంబరు 10వ తేదిన నామినేషన్స్ కు చివరి తేది కాగా 11న వెరిపికేషన్ జరుగుతుంది..ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్,,డిశంబరు 3వ తేదిన ఓట్ల లెక్కింపు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *