ఈస్టర్ సందర్భంగా చర్చిని సందర్శించిన ప్రధాని మోదీ
అమరావతి: గుడ్ ఫ్రైడే అనంతరం క్తైస్తవులు జరుపుకున ఈస్టర్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఢిల్లీలోని సెక్రేడ్ హార్ట్ కేథ్రాడల్ చర్చిని సందర్శించారు..చర్చ్ కు చేరుకున్న ప్రధానమంత్రి, క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు..దేశ ప్రధాని ఈ చర్చిని సందర్శించడం ఇదే మొదటిసారి కావడంతో పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు,,చర్చి ప్రధాన పాస్టర్ స్వామినాథన్, ప్రధాని నరేంద్ర మోడీకి ఏసుక్రీస్తు శిలువను కానుకగా అందించారు..ప్రధాన మంత్రి ఈస్టర్ సందర్భంగా చర్చికి రావడం వల్ల తాము ఎంతో సంతోషం కలిగిందని స్వామినాథన్ తెలిపారు.. ప్రధానమంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అక్కడ వారితో ఫోటోలు దిగారు..తరువాత చర్చి ముందు ఉన్న గార్డెన్లో ప్రధాని మొక్కను నాటారు..ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటన దృష్ట్యా అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్టు చర్చి నిర్వాహకులు తెలిపారు.
Easter celebrations in Delhi! pic.twitter.com/J0gz9RhhLj
— Narendra Modi (@narendramodi) April 9, 2023