AMARAVATHIBUSINESS

ఉద్యోగ రత్న అవార్డు అందుకున్న రతన్ టాటా

అమరావతి: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా(85)కు మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరిచింది.. శనివారం ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే,,డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్,,అజిత్ పవార్ లు ఉద్యోగ రత్న అవార్డును ప్రధానం చేశారు..మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరమే ఏర్పాటు చేసిన ఉద్యోగ రత్న అవార్డుకు రతన్ టాటా ఎంపికైయ్యారు..85 ఏళ్ల రతన్ టాటా ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు..దక్షిణ ముంబైలోని రతన్ టాటా ఇంటి వద్దకే వెళ్లి,,అవార్డుతో పాటు మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (MIDC) నుంచి శాలువా,,ప్రశంసాపత్రం,, జ్ఞాపికను అందజేశారు..ఈ సందర్భంగా సీఎం ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ, రతన్ టాటా, టాటా గ్రూప్స్ ద్వారా దేశానికి ఎనలేని సేవలందించాయన్నారని,,అన్ని రంగాల్లోను టాటా గ్రూప్ విస్తరించడంతో పాటు ఎన్నో వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించదన్నారు.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డును స్వీకరించిన రతన్ టాటా,,ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు..టాటా గ్రూపు 6 ఖండాల్లో 100కి పైగా దేశాల్లో ఈ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *