x
Close
NATIONAL

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాతృవియోగం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాతృవియోగం
  • PublishedDecember 30, 2022

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది..నరేంద్రమోడీ తల్లి హీరాబెన్(100) కన్నుమూశారు..రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో చికిత్సలకు అమె శరీరం స్పందిస్తుండడంతో,,వైద్యులు రెండు రోజుల్లో అమెను ఇంటికి పంపిస్తామని తెలియచేశారు..చికిత్స పొందుతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి., మాతృమూర్తి మరణ వార్త తెలియడంతో, ప్రధాని నరేంద్రమోడీ  ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ కు చేరుకున్నారు..ఈరోజు తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ నరేంద్రమోడీ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది..తన మాతృమూర్తి హీరాబెన్‌ కన్నుమూతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగ ట్వీట్‌ చేశారు..‘‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకుని దేవుడి చెంతకు చేరారు..ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది.. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు..ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా’’ అని ప్రధాని మోడీ ట్విటర్‌లో తెలిపారు..

ప్రోటోకాల్ పక్కన పెట్టి:- గుజరాత్లో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆమె పార్థీవ దేహానికి నివాళి అర్పించిన మోడీ,,ప్రోటోకాల్ పక్కన పెట్టి తల్లి అంతిమ కార్యక్రమాల్లో పాల్గొని,,తల్లి పాడె మోశారు..తల్లి మృతదేహం చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.