‘మిస్ యూనివర్స్’ 2023 కిరీటాన్నిని సొంతం చేసుకున్న”షెన్నిస్ పలాసియోస్”
అమరావతి: ప్రతిష్ఠాత్మకరమైన ‘మిస్ యూనివర్స్’ 2023 కిరీటాన్నినికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్(23) గెలుచుకున్నది..గత సంవత్సరం విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని షెన్నిస్ కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు..72వ మిస్ యూనివర్స్ పోటీలు శాన్ సాల్వడార్ వేదికగా ఆదివారం అట్టహాసంగా జరిగాయి.. 84 దేశాల నుంచి సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగ్వా మహిళగా షెన్నిస్ పలాసియోస్ నిలిచింది.. థాయ్ లాండ్ కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్ గా నిలువగా, అస్ట్రేలియాకు చెందిన మోరయో విల్సన్ రెండో రన్నరప్ గా నిలిచింది.