రాష్ట్రంలో 92 మంది మున్సిపల్ కమిషనర్లు బదలీ
అమరావతి: రాష్ట్రంలో 92 మంది మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం శుక్రవారం నాడు బదిలీ చేసింది.. ఇందుకు సంబంధించిన GOను స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి జారీ చేశారు..3 సంవత్సరాలకు పైగా సొంత జిల్లాలో:-త్వరలో సాధరణ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఎన్నికల ప్రక్రియతో నేరుగా సంబంధం ఉన్న అధికారుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..మూడేళ్లకు పైగా సొంత జిల్లాలో, ప్రమోషన్ పొంది అక్కడే పోస్టింగ్ లలో ఉన్న మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది..కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు బదిలీలు చేస్తున్నట్టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఉత్తర్వుG.O.Rt.No.105ల్లో పేర్కొన్నారు..ఎక్సైజ్ శాఖలోని అధికారుల బదిలీల కోసం ప్రత్యేక జీవో ఆర్టీ నెంబర్ 106ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.