AMARAVATHIDEVOTIONAL

హిందు దేవాలయలపై 10 శాతం పన్ను విధించే చట్టం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

అమరావతి: కర్ణాటకలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం హిందు దేవాలయలపై పన్ను విధించేందుకు వీలుగా కొత్త ఎండోమెంట్‌ బిల్లును అసెంబ్లీ ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకుంది..ఈ బిల్లు ప్రకారం కోటికి మించి ఆదాయం ఉన్న దేవాలయాలపై ప్రభుత్వం 10 శాతం పన్ను విధిస్తుంది..కర్ణాటక ప్రభుత్వం తీరుపై బీజేపీ భగ్గమన్నది.. కర్ణాటక ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం తన ఖాళీ ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు..కేవలం హిందూ దేవాలయ ఆదాయాలపైనే ప్రభుత్వం ఎందుకు పన్ను విధిస్తోందని,,ఇతర మతాలకు చెందిన ప్రార్ధన మందిరాలపై పన్ను ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *