22వ శ్రీ అష్టలక్ష్మీ యాగం-రఘనాథచార్య స్వామి
నెల్లూరు: శ్రీ భగవద్రామానుజ సిద్దాంత శ్రీ అష్టలక్ష్మీ పీఠం నేతృత్వంలో ప్రజలందరి క్షేమం కోసం నెల్లూరు నగరంలోని V.R.C మైదానంలో 23,24,25వ తేదిల్లో 9వ ఉభయ వేదాంత పండిత సభలు నిర్వహిస్తున్నట్లు శ్రీగోదా చరణ మంజనీర పీతాంబరం రఘనాథచార్య స్వామి తెలిపారు.గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19వ తేది నుంచి మార్చి 3వ తేది వరకు ప్రతి రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు..ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు కోటి శ్రీ విష్ణుసహస్ర నామ పారాయణలో జరుగుతుందని,,ప్రజలందరూ పాల్గొన్నాలని కోరారు. ప్రతి రోజు ఉదయం 9.45 నుంచి 11.45 వరకు కార్యక్రమాలు..23వ తేది శ్రీవిష్వక్సేన ఇష్టి,,24-శ్రీధన్వంతరి ఇష్టి,,,25-శ్రీలక్ష్మీనారాయణ ఇష్టి,,,26-శ్రీహయగ్రీవ ఇష్టి,,,27-శ్రీ వైనతేయ ఇష్టి,,,28-శ్రీసుదర్శన ఇష్టి,,,29-శ్రీ నారసింహా ఇష్టి,,,1వ తేది శ్రీలక్ష్మీ ఇష్టి,,,2వ తేది పుత్ర కామేష్టి జరుగుతాయి..