TDP సీనియర్ నేత, మాజీ MP రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ
హైదరాబాద్: TDP సీనియర్ నేత, మాజీ MP రాయపాటి.సాంబశివరావు నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సోదాలు చేపట్టారు..మంగళవారం ఉదయం నుంచి 15 ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో ఈడీ,,,,జూబ్లీహిల్స్,,మణికొండ,,పంజాగుట్ట,,గుంటూరులో సోదాలు చేస్తున్నాయి..ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకు డైరెక్టర్లగా వున్న రాయపాటి.సాంబశివరావు,,మలినేని.సాంబశివరావుతో పాటు ప్రమోటర్ల ఇళ్లు,,కార్యాలయాల్లో ED అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.. ట్రాన్స్ ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ,,13 బ్యాంకుల నుంచి దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా రుణాలను తీసుకుని ఎగవేసినట్లు సమాచారం.. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ, ఈ డబ్బును డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి,,వాటి ద్వారా సింగ్ పూర్ కు తరలించినట్లు ED అనుమానిస్తుంది..గత సంవత్సరం సీబీఐ నమోదు చేసిన FIR అధారంగా ED మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది..