AMARAVATHIPOLITICS

సొంత ఇల్లు, భూమి,వాహనం కూడా లేవు- యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌

అమరావతి: బీజెపీ అభ్యర్దిగా మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌ (32) కర్ణాటకలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం లక్ష్మణతో మైసూర్-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష పోరుకు సై అంటూ లోకసభ ఎన్నికల బరిలో దిగారు..సోమవారం అయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఇల్లు, భూమి లేదా వాహనం కూడా లేవని పేర్కొన్నారు..నామినేషన్ పత్రాల ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు దాదాపు రూ.4.99 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు.. అంతేకాకుండా తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలనూ అఫిడవిట్‌లో పేర్కొన్నారు..తన భార్య త్రిషిక కుమారీ వడియార్‌కు రూ.1.04కోట్లు, వారి సంతానం పేరిట రూ.3.64కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు.. తన తల్లి ప్రమోద దేవీ వడియార్‌, బీజేపీ స్థానిక ఎమ్మెల్యే శ్రీవత్సతో కలిసి మైసూరులోని ఎన్నికల కార్యాలయానికి వెళ్లి రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలు అధికారికి అందజేశారు..

2013లో శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్‌ కన్నుమూసిన రెండేళ్లకు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్​ మైసూరు 27వ రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ యూనివర్సిటీలో ఇంగ్లిష్​ లిటరేచర్​, ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు..2016లో దుంగార్‌పుర్‌ యువరాణి త్రిషికను వివాహం చేసుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *