AMARAVATHI

పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేయొద్దని అలాగే ఎన్నికల విధుల్లో కూడా వలంటీర్లు పాల్గొనవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ సీ.ఎస్ ను ఆదేశించింది..పెన్షన్ల పంపిణీపై మల్లగుల్ల పడిన ఉన్నతాధికారులు మంగళవారం నాడు పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది..బుధవారం నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది..దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులు, రోగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని,,మిగతా వారికి గ్రామ,, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసే విధంగా మార్గదర్శకాలను విడదుల చేసింది.. మూడు రోజుల పాటు గ్రామ,, వార్డు, సచివాలయాల్లో పంపిణీ చేయాలని,,ఆటు తరువాత నేరుగా ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని సూచించింది..సచివాలయాల వెల్ఫేర్ సెక్రటరీలు,, పంచాయతీ అధికారులకు పెన్షన్లు డ్రా చేసేందుకు,, పంపిణీకి ఆథరైజేషన్ లెటర్లు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లు,, మండల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది..ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ విడుదల చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *