టీటీడీ చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు..ఈ మేరకుఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..2006-2008 మధ్య టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు..ఈనెల 8వ తేదితో ప్రస్తుత పాలకమండలి పదవి కాలం ముగియనుంది..ఈ క్రమంలో ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి తరువాత నూతన టీటీడీ చైర్మన్ గా భూమనకరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..రెండెళ్ల పాటు అయన ఈ పదవీలో కొనసాగనున్నారు.