AMARAVATHINATIONAL

జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి

అమరావతి: జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారని జమ్ముకాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు,స్థానిక పోలీసులతో కలసి కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.. భద్రతా దళాలు గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు..ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..చికిత్స పొందుతూ, వారు మరణించినట్టు ఆర్మీ తెలిపింది.. మరణించించిన సిబ్బంది చేతిలో ఉన్న నాలుగు ఏకే-47 రైఫిల్ ను ఉగ్రవాదులు తీసుకుని వెళ్లారని,,వీరి కోసం సెర్చి కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు..ఆర్మీ అధికారులపై ఉగ్రవాదులు శుక్రవారం కాల్పులు జరపడంతో ఎన్ కౌంటర్ ప్రారంభమైనట్టు వెల్లడించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *