AMARAVATHIDISTRICTS

మానవత్వంను మరిచి పోతున్న శ్రీచైతన్య కాలేజీ-దివ్యాంగుడికి సైతం తప్పని వేధింపులు

సకాలంలో స్పందించిన పోలీసులు..

నెల్లూరు: కాసుల కోసం కార్పొరేట్ కాలేజీలు,మానవత్వంను మరిచిపోయి వ్యవహరిస్తున్నాయి అనేందుకు అటు విద్యార్దులు,ఇటు ఉద్యోగులకు ఎదురు అవుతున్న ప్రాణ హననా సంఘటనలే ఉదాహరణలు..వేల,లక్షల రూపాయల ఫీజులను విద్యార్దుల తల్లి,తండ్రుల నుంచి గుంజుకునేందుకు,ర్యాంకులను సాకుగా చూపుతున్నాయి..కార్పొరేట్ కాలేజిలు పెట్టే మానసిక వత్తిడికి తట్టుకోలేక,పసి మొగ్గలు ప్రాణాలు తీసుకుంటున్నారు..అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికి,వాటిని మసిపూసి మారేడు కాయను చేస్తున్నాయి..తిల పాపం తలా పిడికేడు అన్న చందన్న కార్పొరేట్ కాలేజిలకి నాయకుల నుంచి అధికారుల వరకు అదే స్థాయిలో సహకారం అందుతున్నాయి అనేది విస్మరించలేని వాస్తవం..విద్యార్దులతో పాటు కార్పొరేట్  కాలేజిల్లోని అధ్యపకులను సైతం అదే స్థాయిలో యాజమాన్యలు దారుణమైన వేధింపులకు గురి చేస్తున్నాయి.విద్యార్దులు ప్రాణాలు తీసుకుంటుంటే,,అధ్యాపకులు మౌనంగా మానసిక ఒత్తడిని భరిస్తున్నారు వేరే దారి లేక..ఇందుకు సోమవారం నెల్లూరులో శ్రీచైతన్య కాలేజి మాజీ ఉద్యోగి మోహన్ కృష్ణ ఉదాంతమే నిదర్శనం..కలెక్టర్ ఆఫీసు వద్ద విధులు నిర్వహిస్తున్న1వ పట్టణ ASI B.V రవిప్రసాద్ సకాలంలో జోక్యం చేసుకుని వుండకపోయి వుంటే,మరో ప్రాణం గాలిలో కలిసి పోయేదే..ఇలాంటి దారుణమైన వేధింపులకు ముంగిపు వుంటుందా??   

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *