ప్రొద్దూటూరులో 300 కేజీల బంగారం సీజ్
అమరావతి: కడప జిల్లా ప్రొద్దూటూరులో బంగారు దుకాణాల్లో గత నాలుగు రోజులుగా తనిఖీలు చేస్తూన్న ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు పలు బంగారం బిస్కెట్లు,,నగలు,, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు..అదివారం సీజ్ చేసిన సామగ్రి,, బంగారాన్ని తమ వాహనాల్లో తిరుపతికి తీసుకుని వెళ్లారు.. ప్రొద్దులూరులోకి ఆక్రమంగా బంగారం దిగుమతి అవుతున్నట్లు అధికారులకు విశ్వనీయమైన సమాచారం అందడంతో నాలుగు రోజులు నుంచి బుశెట్టి జువెలర్స్ & డైమండ్స్,,తల్లం,,గురురాఘవేంద్ర జువెలర్స్ లో దాదాపు 4 షాపుల్లో రాత్రి,,పగలు విరామం లేకుండా అధికారులు తనిఖీలు చేశారు..అక్రమంగా స్టాక్ చేసిన దాదాపు 300 కేజీల బంగారం,,పెద్ద మొత్తంలో నగదును ఐటీ శాఖ అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తొంది..ఈ సోదాలకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి తమకు అధికారం లేదని, ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలోనే పూర్తిగా రికార్డులన్నీ పరిశీలించాకే వివరాలు వెల్లడిస్తామని ఐటీశాఖాధికారులు మీడియాకు తెలిపారు.. నాలుగు షాపుల్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు బిల్లులు లేకపోవడంతో బంగారంను స్వాధీనం చేసుకున్నారు..బంగారు నగల వ్యాపారంలో ప్రొద్దూటూరుకు రెండో ముంబైగా గుర్తింపు వుంది..ప్రొద్దుటూరును సిటీ ఆఫ్ గోల్డ్ గా ఈ నగరంను పిలుస్తారు.. ఇక్కడ పెద్ద సంఖ్యలో బంగారం షాపులు వుండడంతో పెద్ద మొత్తంలో పసిడిని కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ప్రొద్దుటూరులో కొనేందుకు ఆసక్తి చూపిస్తారు.