AMARAVATHIINTERNATIONAL

మధ్యధర సముద్రంలో జరిగి ఘోరం పడవ ప్రమాదంలో 61 మృతి

అమరావతి: మధ్యధర సముద్రంలో జరిగి ఘోరం పడవ ప్రమాదంలో 61 మరణించారు..మహిళలు, చిన్నారులతో సహా మొత్తం 86 మందితో వెళ్తున్న పడవ బలమైన అలల తాకిడికి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఆదివారం ఉదయం లిబియా తీరంలో జరిగిన ఈ ప్రమాదంలో పడవలోని మరో 25 మందిని లిబియా రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి.. నైజీరియా, గాంబియా లాంటి ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రజలు జీవనోపాధి కోసం యూరప్ దేశాలకు వలస వెళ్లుతుంటారు..ఈ నేపధ్యంలో లిబియా నుంచి మొత్తం 86 మందితో బయలుదేరిన పడవ లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణ సమీపంలో సముద్రంలో బోల్తా పడిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *