పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది..వృద్ధులకు పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని,,గత నెలల్లో పించన్ల పంపిణీ విషయంలో చాలా ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేసింది.. గతంలో ఇచ్చిన ఆదేశాలను పక్కాగా పాటించాలని,,ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని.. కుదరని పక్షంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో చెల్లించాలని పేర్కొంది.. గతంలో మాదిరి గవర్నమెంట్ ఎంప్లాయిస్ను పెన్షన్ల పంపిణీకి ఉపయోగించుకోవాలని ఈసీ సూచించింది..ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డికి స్పష్టం చేసింది..పించన్లు పంపిణీకి పర్మనెంట్ ఎంప్లాయిస్ను వినియోగించుకోవాలని పేర్కొంది..