AMARAVATHIINTERNATIONAL

ఖతార్ లో నౌకాదళ మాజీ అధికారుల మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించిన కోర్టు

అమరావతి: భారతదేశంకు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు ఖతార్ లోని అల్ దహ్రా అనే సంస్థలో పని చేస్తూ,,గూఢచర్యంకు పాల్పపడరంటూ ఆరోపణలు ఎదుర్కొని,,మరణశిక్షకు గురైన వీరికి గురువారం కోర్టు నుంచి పెద్ద శంతనం లభించింది..భారత ప్రభుత్వం అప్పీల్ పై వారి మరణశిక్షపై స్టే విధిస్తూ ఖతార్ కోర్టు కీలక తీర్పు ఇచ్చిందని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది..వారి మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించినట్టు పేర్కొంది.. 8 మంది భారతీయుల మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించడం మంచి పరిణామమే అని,,అయితే ఎన్ని రోజులు శిక్షను విధించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు..ఈ తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని,, ఈ అంశంపై ఖతార్ అధికారులతో తాము చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది..మొదటి నుంచి 8 మందికి సంబంధించిన కుటుంబాలకు అండగా ఉన్నామని,,ఇది సున్నితమైన విషయం కాబట్టి ఇంత కంటే దీని గురించి ఎక్కువగా మాట్లాడటం సరికాదని అధికారులు పేర్కొన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *