దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు-రిక్టరు స్కేలుపై 6.1గా నమోదు
అమరావతి: దేశ రాజధాని ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం సమయంలో భారీ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి..రిక్టరు స్కేలుపై 6.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది..ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.. ఢిల్లీతోపాటు పంజాబ్,, చండీగఢ్,,జమ్మూకశ్మీర్ తో సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించింది..ఈ భూకంపం ధాటికి తీవ్ర భయాందోళనకు గురి అయిన ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు..ఈ ప్రకంపనలతో ఇళ్లలోని ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఊగిపోయాయి.. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.