4 సంవత్సరాల తరువాత సొంత ప్రాంతానికి చేరుకున్న ఎంపీ రఘురామ
అమరావతి: వైసీపీ రెబల్ ఎంపీ కృష్ణంరాజు ఎట్టకేలకు తన సొంత ప్రాంతానికి చేరుకున్నారు..4 సంవత్సరాలుగా సొంత ప్రాంతానికి దూరంగా ఉన్న ఆయన శనివారం ఉదయం రాజమండ్రి విమానాశ్రయంకు చేరుకున్నాడు..విమానాశ్రయం వద్ద రఘురామ కృష్టంరాజుకు ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు..అనంతరం రోడ్డు మార్గం ద్వారా ర్యాలీగా భీమవరంకు వెళ్లారు..ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాలుగేళ్ల తరువాత సొంత ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు..మాటల్లో చెప్పలేనంత అనుభూతి కలుగుతుందన్నారు.. నేను జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ అందించిన సహకారం జీవితంలో మరవలేనని చెప్పారు.. అభిమానులు, తెలుగుదేశం, జనసేన నాయకులు చూపిన ప్రేమ, ఆదరణ నా జీవితంలో ఎప్పటికి గుర్తు వుండిపొంతుందన్నరు.