DISTRICTSPOLITICS

ఏప్రిల్ 7న టీడీపీ జోన్-4 సమీక్ష సమావేశానికి రానున్న చంద్రబాబు

నెల్లూరు: నగరంలోని జాతీయ రహదారికి అనుకుని ఉన్న వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో ఏప్రిల్ 7వ తేదీ శుక్రవారం జరిగే జోన్-4 సమీక్ష సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ సీ.ఎం చంద్రబాబునాయుడు రానున్నారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ తెలిపారు.మంగళవారం సంబంధిత ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం అయన మాట్లాడుతూ జోన్-4 పరిధిలో 5 పార్లమెంటు నియోజకవర్గాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, ఒంగోలు, వాటి పరిధిలో ఉన్న35 అసెంబ్లీ నియోజకవర్గాలలోని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులతో చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారని చెప్పారు.రాబోవు రోజుల్లో దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎలా చేరువ అవ్వాలి ప్రజా సమస్యల పై ఎలా పోరాడాలి అన్న అంశాల పై దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.. ఏప్రిల్ 7వ తేదీ శుక్రవారం ఉదయాన్నే 9.30 గంటల నుంచి ప్రతి పార్లమెంటుకు ఒక రిజిస్ట్రేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ప్రజల పై జరుగుతున్న దౌర్జన్యాలపై పోరాటానికి సమస్యల పరిష్కారానికి పార్టీ లీగల్ సెల్ ద్వారా ప్రత్యేకంగా కృషి చేస్తుందనీ పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమావేశం ఉంటుందని, పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జోన్-4 కి దిశా నిర్దేశం చేయనున్నారని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *