అమరావతి: సముద్రజలాల్లో పరిశోధనల పేరిట,,గూఢచర్యం చేసే, చైనా స్పై షిఫ్ యువాన్ వాంగ్-5 శ్రీలంకలోని హంబన్ టొట పోర్టుకు చేరుకుంది..స్పై షిఫ్ పోర్టుకు చేరుకున్నట్లు హార్బర్ కెప్టెన్ నిర్మల్ డిసెల్వ తెలిపారు..ఈ స్పై షిప్, భారతదేశ రక్షణ వ్యవస్థలకు సంబంధించిన వివరాలపై ఆరాతీసేందుకు ప్రయత్నిస్తదని,,ఈ స్పై షిప్ రాకను భారత్ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు శ్రీలంకకు అభ్యంతరాలను తెలియజేసింది..దీనిపై స్పందించిన లంక అధికారులు యువాన్ వాంగ్-5 ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనాను కోరారు.. శ్రీలంక సూచన మేరకు షిప్ రాక వాయిదా పడినట్లు ప్రచారం జరిగినా,, గతవారం యువాన్ వాంగ్ హంబన్ టొట దిశగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు భారత్ గుర్తించింది.. ప్రయాణంను ఎందుకు వాయిదా వేయాలంటూ, శ్రీలంక ప్రభుత్వాన్ని చైనా అధికారులు ప్రశ్నించడంతో,, వారు సరైన వివరణ ఇవ్వలేకపోయినట్లు సమాచారం..దీంతో శనివారం షిప్ రాకకు శ్రీలంక అనుమతి మంజూరు చేసింది..శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ను ఆఫ్ చేయాలనే నిబంధనపై అనుమతి ఇచ్చినట్లు లంక అధికారులు తెలిపారు..లంక జలాల్లో ఎలాంటి సర్వేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు..ఈనెల 16 నుంచి 22 మధ్యలో కేవలం ఇంధనం నింపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామని లంక అధికారులు తెలిపారు..పొరుగు దేశాలతో భద్రత, సహకారం తమ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.. చైనా,,హంబన్ టొట పోర్టు అభివృద్ధికి 1.2 బిలియన్ డాలర్ల రుణం శ్రీలంకకు ఇచ్చింది..అయితే శ్రీలంక సకాలంలో రుణం చెల్లించలేకపోవడంతో చైనా ఈ పోర్టును 99 సంవత్సరాల లీజుకు తీసుకుంది..
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.