AMARAVATHIDISTRICTS

ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ పారదర్శకతతో కొనసాగుతుంది-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ పారదర్శకతతో కొనసాగుతుందని, పెండింగ్ లో వున్న  క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ను డిసెంబర్, 26వ తేదీ నాటికి పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ నిర్వహించిన సమావేశం అయన మాట్లాడుతూ, డిశంబరు 9 వరకు స్వీకరించిన అభ్యంతరాలను డిశంబరు 26వ తేదీ నాటికి పారదర్శకంగా పరిశీలించి పరిష్కరించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి కృషిచేస్తున్నామని తెలిపారు. ఈ నెల 4,5 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో స్పెషల్ కాంపెయిన్ నిర్వహించి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ను స్వీకరించడం జరిగిందని, అలాగే డిసెంబర్, 2, 3 తేదీల్లో కూడా స్పెషల్ కాంపెయిన్ నిర్వహించి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ను స్వీకరించడం జరుగుతుందన్నారు. జిల్ల్లాలో ఈవీఎంల తొలిదశ తనిఖీ ప్రక్రియ కూడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తీ చేయడం జరిగిందని, ఈ ప్రక్రియకు సహకరించిన అన్నీ రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలుపారు. జిల్లాలోని అన్నీ నియోజక వర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ ను పూర్తిస్థాయిలో నియమించుకోవాలని రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు. ఓటర్ల జాబితాలో నూరుశాతం అర్హులైన ఓటర్లు నమోదైవుండాలనే లక్ష్యంతో భారత ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు వారం వారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి కృషిచేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో  జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, వైఎస్ఆర్సిపి ప్రతినిధులు వెంకట శేషయ్య,  టిడిపి ప్రతినిధులు చేజర్ల భువనేశ్వర ప్రసాద్, బిజెపి ప్రతినిధులు శ్రీనివాస్, బి..ఎస్.పి ప్రతినిధులు శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *