బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి-కమీషనర్
నెల్లూరు: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికై బాల్య వివాహాలను నిర్మూలించాలని, వివాహ చట్టాలపై ప్రజల్లో చైతన్యం పెంచాలని నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి, కమిషనర్ వికాస్ మర్మత్, సీనియర్ సివిల్ జడ్జి వాణిలు పేర్కొన్నారు. బాల్య వివాహా నిరోధన మరియు పర్యవేక్షణ నగర పాలక సంస్థ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం కార్పొరేషన్ లోని ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కల్పించే పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, వైద్యాధికారులు, పోలీసు విభాగం, సామాజిక కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, మేప్మా,నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.