AMARAVATHIDISTRICTS

అరాచ‌క పాల‌న‌ను త‌రిమికొట్టేందుకే కూటమి ఏర్పాటు-నారాయ‌ణ‌

2024లో అత్య‌ధిక మెజారిటీతో గెలుస్తాం

నెల్లూరు: జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పుణ్య‌మా అని, పిల్లల భవిష్యత్ అంధకారంలో పోయిందని, రాష్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని టీడీపీ నెల్లూరుసిటీ అభ్యర్ది నారాయణ అన్నారు..గురువారం అయన జ‌న‌సేన నేత‌ల‌తో ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,,బీద ర‌విచంద్ర‌లు ఆత్మీయ‌ భేటీ అయ్యారు..నెల్లూరు జిల్లా జ‌న‌సేన పార్టీ కార్యాలయంలో మ‌నుక్రాంత్‌రెడ్డి, సుజ‌య్ బాబుల‌ను వారు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు..అనంరంత నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ‌త ఐదేళ్లుగా  రాష్టంలో అరాచక పాలన సాగుతుందని,,ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతోనే  అందరం కలిశామ‌ని చెప్పారు..త్వరలో జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్య‌క్తం చేశారు.. ప్రభుత్వం వచ్చాక జనసైనికులకు ప్రతి ఒక్కరికి విలువలతోపాటు గౌర‌వం ఇస్తామ‌ని ఆ బాధ్య‌తను తీసుకుంటాన‌ని వారికి నారాయ‌ణ హామీ ఇచ్చారు..మ‌నుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరంలో జరిగే ఎన్నిక‌ల్లో ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా నారాయ‌ణ‌ని భారీ మెజారిటీ గెలిపించుకునేందుకు ప్ర‌తీ ఒక్క‌రం కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, జ‌న‌సైనికులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *