AMARAVATHI

ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై వున్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..ఈ నెల 22వ తేది నుంచి 31వ తేది వరకు బదిలీలకు అవకాశం ఇస్తూ ఆర్థికశాఖ  ఆదేశాలు ఇచ్చింది..ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది..ఏప్రిల్ 30 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారికి బదిలీ తప్పనిసరి అని, ఏప్రిల్ 30 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తైన వారికి బదిలీకి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది..వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖలు, ఎక్సైజ్, రవాణా, వ్యవసాయ శాఖలూ బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది.. పాఠశాల,ఇంటర్, ఉన్నతవిద్య శాఖలకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది..జూన్ 1 నుంచి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం వర్తిస్తుందని ఆర్థికశాఖ పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *